రెబ్బెన : ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్,CPI జిల్లా కార్యదర్శి బద్రి సత్యనారాయణ లు పిలుపునిచ్చారు. మంగళవారం రెబ్బెన రెబ్బెన మండలం లోని గోలేటి సిపిఐ కార్యాలయంలో మండల మూడవ నిర్మాణ మహాసబ లొ ముఖ్య అతిథులుగా పాల్గొని వారు మాట్లాడుతూ నిత్యావసర సరుకులు చుక్కలను అంటిన వాటిని అదుపు చేయడంలో ప్రభుత్వాలు విఫలం చెందయని అన్నారు. దేశంలో మతోన్మాదం పెంచే విధంగా BJP ప్రభుత్వం వ్యవహరిస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు తిరుపతి, మండల కార్యదర్శి నర్సయ్య, పట్టణ కార్యదర్శి జగ్గయ్య,AISF జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్,AITUC జిల్లా కార్యదర్శి ఉపేందర్,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు జాడి గణేష్, మహిళ సంఘం నాయకులు భీమక్క పాల్గొన్నారు.
No comments:
Post a Comment