వార్షిక ఉత్పత్తి లక్ష్యాన్నిఅధిగమించినందుకు మిఠాయిల పంపిణి
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) మే 14 ; రెబ్బెన మండలం గోలేటి క్రాస్ రోడ్ వద్ద గల సి ఎస్ పి లో గోలేటి జీఎం కార్మికులకు సోమవారం మిఠాయిల పంపిణి చేసారు. బెల్లంపల్లి సింగరేణి ఏరియా పరిధిలో 2017-18 కి గాను వార్షిక ఉత్పత్తి లక్ష్యాన్ని అధిగమించినందుకు గాను ఏరియాలోని అన్ని గనులలో మరియు డిపార్టుమెంట్ లలో కార్మికులకు మిఠాయిలు పంపిణి చేసారు. ఈ సందర్భంగా జీఎం రవిశంకర్ మాట్లాడుతూ కార్మికులు ఈ సంవత్సరంకూడా వార్షిక నిర్దేశిత ఉత్పత్తి లక్ష్యాన్ని అధిగమించాలని అన్నారు. కార్మికుల, ఉద్యోగుల సమిష్టి కృషితోనే ఇది సాధ్యమని అన్నారు. సింగరేణి సంస్థ కేవలం ఉత్పత్తి మాత్రమే కాకుండా కార్మికుల శ్రేయస్సు కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఓ టూ జీఎం శ్రీనివాస్, డిజైన్ పర్సనల్ కిరణ్, టీజీబీకేఎస్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రావు, విశ్వనాధ్, సుదర్శనం తదితర అధికారులు, కార్మికులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment