Friday, 18 May 2018

పంచాయతీ ఎన్నికలపై పాలనాధికారి సమీక్ష సమావేశం

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మే 18 ;  తెలంగాణ రాష్ట్రంలో గ్రామపంచాయతీ ఎన్నికలలు దగ్గరపడడడంతో కొమురంభీం  ఆసిఫాబాద్ జిల్లా పాలనాధికారి ప్రశాంత్ జీవన్  పాటిల్  సమావేశమందిరంలో ఎంపీడీఓ లతో శుక్రవారం  సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామా పంచాయతీ వారీగా ఎస్ సి, ఎస్ టి, బి సి ల గణన వార్డుల వారీగా  తయారు చేయాలని అన్నారు. పోలింగ్ స్టేషన్లను ప్రభుత్వ భవనలలోనే  ఏర్పాటు చేయాలనీ , అందుబాటులో  లేనప్పుడే ప్రైవేట్ భవనాలలో ఏర్పాటు చేయాలన్నారు.ఎన్నికలకు అవసరమయ్యే సిబ్బంది  సంఖ్యా గురించి ముందుగానే సమాచారం ఇవ్వాలన్నారు. పోలింగ్ కేంద్రాల సమాచారం ముందుగానే ఇవ్వాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డి పి  ఓ గంగాధర్, ఎంపీడీఓ లు అధికారులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment