కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) మే 8 ; కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ప్రాధమిక ఆసుపత్రిలో మంగళవారం రెబ్బెన తెరాస మహిళా విభాగం తరపున టౌన్ అధ్యక్షురాలు ఎం పద్మ, ప్రధాన కార్యదర్శి అన్నపూర్ణ అరుణ లు గర్భిణీ స్త్రీలకు అల్పాహారం పంపిణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతు ప్రభుత్వాస్పత్రికి వచ్చే వారికీ తమ వంతు సహాయ సహకారాలు అందించాలన్న సేవా దృక్పధం తో ప్రతి మంగళవారం ప్రభుత్వాస్పత్రిలో పండ్లు, అల్పాహారలను పంపిణి చేస్తున్నట్లు తెలిపారు. పేద ప్రజలకు తెరాస ప్రభుత్వం ఎన్నో ఉచిత వైద్యసేవలను అందిస్తున్నది, తమవంతుగా తెరాస పార్టీ మహిళా కార్యకర్తల విభాగం తరుపున ఆసుపత్రికి మండలంలోని వివిధ గ్రామాలనుంచి వచ్చే వారికోసం ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు చేపడతాం అన్నారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కుందారపు శంకరమ్మ, ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ కుమారస్వామి , ఆస్పత్రి సిబ్బంది సునీత, పావని, లావణ్య, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment