కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మే 27 ; రెబ్బెన మండలం గోలేటి బస్టాండ్ లో వేసవి కాలం సందర్బంగా బెటర్ యూత్ బెటర్ సొసైటీ సేవా సంస్థ ఆద్వర్యం లో అంబలి పంపిణి కార్యక్రమం చేపట్టారు. అధ్యక్షులు ఓరగంటి రంజిత్ మాట్లాడుతూ వేసవి కాలం లో ఎండలు ఎక్కువ ఉండటం వల్ల ప్రజలు వేడి నుండి ఉపశమనం పొందేందుకు ప్రతి ఆదివారం 500 మందికి అంబలి పంపిణి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు రాజాశేఖర్, రవీందర్,ఏగ్గే తిరుపతి ప్రధాన,సహాయ కార్యదర్శి అజయ్, విజయ్, సభ్యులు, బలుగురి తిరుపతి,రాజశేఖర్,సాయి,అమ్ములు,తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment