Thursday, 24 May 2018

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుందాం ; ఇంచార్జ్ జియం కె కొండయ్య

    కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మే 24 ; (రెబ్బెన) ;  తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుందామని  బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఇంచార్జ్ జియం కె కొండయ్య అన్నారు. రెబ్బెన మండలంలోని గోలేటి జనరల్ మేనేజర్ కార్యాలయంలో గురువారం సింగరేణి అధికారులకు ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ  సంవత్సరం కూడా తెలంగాణ ఆవిర్భావ వేడుకలను పండుగ వాతావరణం మధ్య ఘనంగా నిర్వహించుకోవాలని అధికారులకు సూచించారు సింగరేణి ప్రతి డిపార్టుమెంటల్ లో కూడా అందరు వేడుకలను జరుపుకోవాలన్నారు . ఆవిర్భావ దినోత్సవం రోజున ఉదయం  జి ఎం  కార్యాలయం నుండి తెలంగాణ రన్ కార్యక్రమం ఉంటుందన్నారు. మహిళలకు ప్రత్యేకంగా ఆటలాపోటీలు మరియు దీపాలంకరణ పోటీల కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సింగరేణి పాఠశాల  ప్రాంగణంలో సాయంత్రం 6 గంటల నుండి సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని అన్నారు. సింగరేణికి  సంబందించిన స్టాల్స్ తో పాటు తెలంగాణ వంటకాల స్టాల్ లను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ  ఆవిర్భావ దినోత్సవంలో ప్రతి ఒక్కరు పాలుపంచుకొని పండుగ వేడుకలను విజయవంతం చేయాలనీ కోరారు.  ఈ కార్యక్రమంలో డిజియం పర్సనల్ జె కిరణ్ కుమార్,ఎస్ ఓటు జియం ఎం శ్రీనివాస్,ఎజియం ఎం రామారావు, ఫైనాన్స్ మేనేజర్ బి శ్రీధర్, ప్రాజెక్ట్ ఆఫీసర్ జి మోహన్ రెడ్డి, డివై సిఎంవో కె అశోక్ కుమార్, డివైపియం లు ఏ రాజేశ్వర్, బి సుదర్శనం, అన్ని గనుల డిపార్ట్మెంట్ అధికారులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment