కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మే 30; రెబ్బెన ; ఉపాధిహామీ కూలీలకు కేటాయించిన పని కొలతల ప్రకారం పూర్తిచేసినట్లైతే కొలతలకు తగ్గట్టుగా సరైన కూలి డబ్బులు చెల్లిస్తామని డి ఆర్ డి ఓ వెంకట్ అన్నారు. బుధవారం రెబ్బెన మండలంలోని నారాయణపూర్, కిష్టాపూర్, నంబాల గ్రామపంచాయతీ పరిధిలలో జరుగుతున్న ఉపాధిహామీ పనులను డి ఆర్ డి ఓ వెంకట్ పరిశీలించారు. ఈ సందర్భంగా అయన కూలీల హాజరు పట్టీలను, వారికి ఏర్పాటు చేసిన వసతులను పరిశీలించారు.వారికీ కేటాయించిన పనులను నాణ్యతతో కొలత ల ప్రకారం చేసినట్లయితే డబ్బులు ఎక్కువ వస్తాయని సూచించారు. ఎండవేడికి ఉపశమనంగా టెంట్లు, ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వీరితోపాటు ఏ పి ఓ కల్పన, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment