Friday, 11 May 2018

దాసారపు వెంకటరాజాం స్మారక క్రికెట్ పోటీలు ప్రారంభం

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) మే 11 ; రెబ్బెన మండల కేంద్రంలో శుక్రవారం  ఫ్రెండ్స్ ఎలెవన్ యూత్ ఆధ్వర్యంలో స్వర్గీయ దాసారపు వెంకట రాజం   స్మారక క్రికెట్ పోటీలను రెబ్బెన ఎంపీపీ కార్నాధం సంజీవ్ కుమార్ ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు యువకులలో మానసికోల్లాసాన్ని పెంపొందిస్తాయని అన్నారు. క్రీడలవల్ల ప్రేమానురాగాలు పెంపొందుతాయని, అన్నారు. ఈ పోటీలలో జిల్లాలోని అన్ని మండలాల జట్లు పాల్గొంటున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో రెబ్బెన ఉపసర్పంచ్ బొమ్మినేని శ్రీధర్ కుమార్, తెరాస మండల అధ్యక్షులు పోటు   శ్రీధర్ ఎడ్డీ, నాయకులూ జహీర్ బాబా, తిరుపతి, మన్సూర్, ఉబైదుల్లా, గోగర్ల రాజేష్, నూతన రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment