Wednesday, 31 October 2018

ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 143 వ జయంతోత్సవాలు

  కొమురంభీం ఆసిఫాబాద్  రెబ్బెన అక్టోబర్  31 : జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా రెబ్బెన మండలం నక్కల గూడ ప్రాథమిక పాఠశాలలో స్వతంత్ర భారతావనికి తొలి హోం మంత్రిగా పని చేసిన " ఉక్కు మనిషి"" సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 143 వ   జన్మదినోత్సవాన్ని   ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆసిఫాబాద్ జిల్లా  పి ఆర్ టి యు  అధ్యక్షులు ఏటుకూరి శ్రీనివాస రావు హాజరై సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం మాట్లాడుతూ  భారతదేశ తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జీవిత చరిత్రను తెలంగాణ పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని కోరారు పటేల్ కృషి వల్లే ఆనాడు హైదరాబాద్  భారతదేశంలో విలీనం అయిందని అన్నారు.  పాఠశాల విద్యార్థులకు స్వీట్లు .నోటు పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది .    పాఠశాల ప్రధానోపాధ్యాయులు కే శంకర్  మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి జాతీయ నాయకుల జీవితాలను ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు మంచి క్రమశిక్షణ తో ఉన్నతంగా ఎదగాలని కోరారు.  ఈ కార్యక్రమానికి పిఆర్టియు జిల్లా ఉపాధ్యక్షులు సదానందం, ఖాదర్ మొయినుద్దీన్,   మండల ప్రెసిడెంట్ ప్రవీణ్ కుమార్,  మండల జనరల్ సెక్రటరీ  అనిల్ పాఠశాల ఉపాధ్యాయులు డి.రమేష్ మరియు పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ మీసాల  పోషమల్లు, విద్యార్థుల  తల్లిదండ్రులు పాల్గొ,న్నారు.

No comments:

Post a Comment