Friday, 26 October 2018

అభివృద్ధి చేయలేక తెరాస నాయకుల సాకులు ; రెబ్బెన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముంజం రవీందర్


కొమురంభీం ఆసిఫాబాద్  రెబ్బెన అక్టోబర్ 26 ; తెరాస నాయకులూ గత నాలుగేళ్ళ పాలనలో అభివృద్ధి చేయలేక సాకులు చెప్తుతు ప్రజలను మభ్య పెడుతున్నారని రెబ్బెన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముంజం రవీందర్ అన్నారు. శుక్రవారం మండలం  గంగాపూర్ గ్రామంలో  ఏర్పాటు చేసిన  విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. తెరాస నాయకులూ ఎన్నికల ప్రచార నిమిత్తమై శుక్రవారం  పలు గ్రామాలలో పర్యటించి ప్రజలకు అవాస్తవాలు చెప్తున్నారన్నారు. ప్రజలు రోడ్ల దుస్థితిపై నిలదీయగా  సర్పంచుల తీర్మానం లేక రహదారులను వేయలేకపోయామని సాకులు చెప్తున్నారని, అదే కాంగ్రెస్ ప్రభుత్వ హయం లో ఏ  సర్పంచుల తీర్మానం తీసుకోకుండానే పనులు పూర్తిచేశామన్నారు. అలాగే రెండవ తిరుపతిగా పేరుగాంచిన వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉన్న  గంగాపూర్ గ్రామానికి 4.5 కోట్లతో రహదారి నిర్మాణానికి , విదుడికారణకు, దేవాలయం అభివృద్ధికి కృషిచేస్తామని చెప్పి ఆ దేమునికే పంగనామాలు పెట్టిన ఘనత ఈ తెరాస  ఎం ఎల్ ఏ  , ఎం ఎల్ సి ల దేనని  అన్నారు. అభివృద్ధిని చేసి చూపించలేక ప్రజలు ఎదురు తిరిగి అడుగుతున్నఅందుకు కుంటి  సాకులు చెప్తున్నారని అన్నారు. రాబోయే ఎన్నికలలో ప్రజలు ఈ విషయాలను జాగ్రత్తాగా గమనించి తెరాస పార్టీ కి తగిన బుద్ధి  చెప్పాలని అన్నారు. ఎన్నికల ముందు దళితులు 3 ఎకరాల భూమి, నిరుద్యోగులకు లక్ష ఉద్యోగాలు, కే జి టూ పి  జి ఉచితవిద్య, డబల్ బెడురూమ్ ఇండ్లు వంటి హామీలను పూర్తిగా మరచి ,  నిస్సిగ్గుగా మరల ఓట్లు అడగడానికి వచ్చిన వారికి ప్రజలు ఎన్నికలలో ఓడించి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు దుర్గం రాజేష్, వెంకటేశం చారి, అనిసెట్టి వెంకన్న, ముంజం వినోద్, గుండె సంతోష్, నగరం భీం రావు, ఇగురాపు రవీందర్, రాజన్నా తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment