Monday, 8 October 2018

క్రీడలలో యువత పాల్గొని విజయం సాధించాలి ; జీఎం రవిశంకర్



  రెబ్బెన ; క్రీడలలో యువత పాల్గొని కోల్ ఇండియా పోటీలలో విజయం సాధించాలని    బెల్లంపల్లి సింగరేణి ఏరియా జీఎం రవిశంకర్ అన్నారు.   రెబ్బెన మండలం గోలేటి భీమన్న స్టేడియం  లో సోమవారం డబ్ల్యూ పి  అండ్ జి ఏ  ఆధ్వర్యంలో ఏరియా బై ఏరియా క్రికెట్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా   పాల్గొని క్రీడాకారులను  పరిచయం చేసుకొని ప్ర్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ పోటీలలో మంచిప్రతిభ చూపి కాల్ ఇండియా పోటీలలో సింగరేణి సంస్థకు మంచి పేరుతేవాలని అభిలషించారు. ఈ రోజు జరిగిన ప్రారంభ మ్యాచ్ లో మందమర్రి ఏరియా జట్టు 170 పరుగులు చేసి ఆల్ అవుట్ కాగా బెల్లంపల్లి జట్టు 174 పరుగులతో విజయం సాధియించింది   ఈ కార్యక్రమంలో  డిజిఎం  పర్సనల్ కిరణ్, స్పోర్ట్స్ సూపర్ వైజర్  రమేష్, కోఆర్డినేటర్ చంద్రశేకర్, మురళి కృష్ణ, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment