Monday, 1 October 2018

అధికారులు, కార్మికుల సహకారంతో వార్షిక ఉత్పత్తి లక్ష్యాలను అధిగమిస్తాం ; జీఎం కె రవిశంకర్



కొమురంభీం ఆసిఫాబాద్   రెబ్బెన ;  వార్షిక ఉత్పత్తి లక్ష్యాలను  అధికారులు,  కార్మికుల సహకారంతో అధిగమించడానికి కృషిచేస్తామని    బెల్లంపల్లి  సింగరేణి ఏరియా జీఎం  కె రవిశంకర్ అన్నారు. సోమవారం రెబ్బెన మండలం గోలేటి జీఎం   కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.  సెప్టెంబర్  మాసంలో 540000టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి 81 శాతంతో  493903  టన్నుల ఉత్పత్తి సాధించడం జరిగిందని అన్నారు. ఏరియా లోని ఖైర్గుడ్ ఓ సీ  పి  లో 280000 టన్నులకుగాను 81  శాతంతో 228051 టన్నుల ఉత్పత్తిని, బి పి  ఏ  ఓ సీ  పి  2 లో 80000 టన్నులకు 102 శాతంతో 81284  టన్నులు, దొర్లి ఓ సీ  పి  లో 180000 టన్నులకు 103 శాతంతో 184568 టన్నుల బొగ్గు  ఉత్పత్తి సాధించినట్లు పేర్కొన్నారు.వార్షిక ఉత్పత్తి లక్ష్యాలు అధిగమించడంలో అన్ని రంగాల  అధికారుల కార్మికుల సహకారం ఎంతైనా ఉందని అన్నారు.    ఏరియా లోని కార్మికులు కారుణ్య నియామకాలకు దరఖాస్తు చేసుకోవాలని అన్నారు కార్మికుల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నామన్నారు. 

No comments:

Post a Comment