కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన అక్టోబర్ 30 : ఎన్నికల్లో మహాకూటమి కి తెరాసకు ప్రజలు ఓటు అనే ఆయుధంతో బుద్ది చెప్పాలని బిజెపి ఆసిఫాబాద్ పార్లమెంటు కన్వీనర్ అజమిరా రామ్ నాయక్, అసెంబ్లీ కన్వీనర్ గుల్బమ్ చక్రపాణిలు అన్నారు మంగళవారం రెబ్బెన లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ నియోజక వర్గంలో బిజెపిని గెలిపించాలన్నారు. ప్రజలు బిజెపిని ఆదరించి ఆసిఫాబాద్ బిజెపి అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు. నరేంద్ర మోడీ ప్రెవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ తెలంగాణా రాష్ట్రంలో కూడా బీజేపీ ని అత్యధిక మెజారిటీ తో గెలిపిస్తే మరెన్నో పథకాలను ప్రజలకు సమాన అవకాశాలతో ప్రెవేశ పే డతామని అన్నారు..ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి అన్నపూర్ణ సుదర్శన్,మండల అధ్యక్షులు కుందారపు బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment