Saturday, 20 October 2018

పోలీసుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం


 కొమురంభీం ఆసిఫాబాద్  రెబ్బెన అక్టోబర్  20: పోలీసులు మీకోసం లో భాగంగా రెబ్బెన పోలీసుల ఆధ్వర్యంలో పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా శనివారం  రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.  రెబ్బెన మండల కేంద్రంలోని  ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన శిబిరాన్ని డి ఎస్ పి  సత్యనారాయణ  ప్రారంభించి మాట్లాడారు. రక్తదానం చేయడం ద్వారా ప్రాణాపాయస్థితిలో ఉన్నవారిని కాపాడవచ్చని, ప్రతిఒక్కరు  రక్తదాన ఆవశ్యకతపై అవగాహన పెంచుకొని రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని అన్నారు. రక్తధానం చేయడం ద్వారా ఎటువంటి అనారోగ్యం కలగదని అన్నారు. ఈ కార్యక్రంలో సర్కిల్ ఇన్సపెక్టర్  రమణమూర్తి, ఎస్సై దీకొండ  రమేష్ , సిబ్బంది, మండల తెరాస నాయకులు , యువకులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment