కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన అక్టోబర్ 11: జిల్లా లో నూతన వాహనాల రాక తో భద్రత మరింత పటిష్టమౌతుందని డి ఎస్ పి సత్యనారాయణ అన్నారు. గురువారం స్థానిక జిల్లా పోలిస్ హెడ్ క్వార్టర్ నందు జిల్లాకు నూతనముగా కేటాయించబడ్డ 106 ద్విచ్రవాహనం లను, 4 ఇన్నోవా పెట్రోలింగ్ వాహనాలను, 1 బుల్లెట్ ప్రూఫ్ వాహనము,1 ఫర్చునర్ వాహనలను నూతన వాహనముల ను రెబ్బెన మండలంలో డి ఎస్ పి సత్యనారాయణ ప్రారంభించి రెబ్బెనలో రూట్ మార్చ్ నిర్వహించారు. ఈ పెట్రోలింగ్ వాహనములకు డయల్100 కు కూడా అనుసంధానము తో ఆసిఫాబాద్ నుంచి వాంకిడి,ఆసిఫాబాద్ నుంచి రెబ్బెన , వాంకిడి నుంచి కెరమెరి, ఆసిఫాబాద్ నుంచి సిర్పూర్ టౌన్ లు కాగజ్ నగర్ మీదుగా నిరంతరం పెట్రోలింగ్ చేస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెబ్బెన సర్కిల్ ఇన్సపెక్టర్ రమణ మూర్తి, వాహనాల ఇంచార్జి ఆర్ ఐ శ్రీనివాస్, మండల పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
No comments:
Post a Comment