Tuesday, 2 October 2018

గాంధీజీ అడుగు జాడల్లో నడవాలి


 కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ; అక్టోబరు  2 ;  : బాపూజీ జయంతిని రెబ్బెనమండలం నక్కలగూడెం గ్రామ జిల్లా పరిషత్ సెకండరీ స్కూల్లో ఘనంగా జరుపుకున్నారు. మహాత్ముని చిత్రపటానికి పూలమాలవేసి వందనం సమర్పించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కల్వల శంకర్ మాట్లాడుతూ గాంధీజీ అడుగు జాడల్లో నడవాలని అన్నారు .  విద్యార్థులు  క్రమశిక్షణతో చదివి సమాజ సేవలో ముందుండాలని, అప్పుడే పేరు ప్రతిష్టలు వస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో  ఉపవాహ్యయులు రమేష్, విద్యార్థులు , గ్రామస్తులు   పాల్గొన్నారు

No comments:

Post a Comment