కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన అక్టోబర్ 12; రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడకుండా ముందస్తు చర్యల్లో భాగంగా రెబ్బెన మండలంలో శుక్రవారం ఐదుగురిని బైండోవర్ చేసినట్లు ఎస్సై దికొండ రమేష్ తెలిపారు. గోలేటి చెందిన అజ్మీర ఆత్మారావు నాయక్, దుర్గం సోమయ్య, గంగాపూర్ కి చెందిన జి హేమాజీ, వడై చందు లక్ష్మీపూర్కు చెందిన చౌదరి నాగయల ను బైండోవర్ చేసి రెబ్బెన తహశీల్దార్ ముందు హాజరుపరిచినట్లు తెలిపారు. అనంతరం సొంత పూచీ కట్టపై విడుదల చేసినట్లు తెలిపారు.
No comments:
Post a Comment