కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన అక్టోబర్ 30 : మైనింగ్ లో బి టెక్, డిప్లొమా చేసిన సింగరేణి కార్మికుల, పిల్లలకు ఆన్ పైడ్ అప్రెంటిస్ షిప్ లుగా తీసు కోవడానికి సింగరేణి సంస్థ నిర్ణయించిందని బెల్లంపల్లి ఏరియా డిజిఎం పర్సనల్ కే కిరణ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సింగరేణి సంస్థ లో ఏరియా ప్రకారం ఉద్యోగుల పిల్లలు ఆయా ఏ రేయాలలోని పర్సనల్ డిపార్ట్మెంట్లలో రిజిస్టర్ చేసుకోవాలని కోరారు. ఈ శిక్షణ కోసం జనవరిలో రిజిస్టర్ చేసుకోవాలని అన్నారు. ఇంతకూ ముందు చేసుకున్న నమోదు పరిగణలోకి తీసుకోబడద న్నారు. కావున ఆసక్తి గలవారు కార్యాలయంలో సంప్రదించవచ్చని అన్నారు.
No comments:
Post a Comment