Tuesday, 16 October 2018

దుర్గా దేవి ఆలయాలలో ప్రేత్యేక పూజలు




రెబ్బెన ; రెబ్బెన మండలం లో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దుర్గా దేవి ఆలయాలలో ప్రేత్యేకపూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరా నగర్లోని స్వయంభు మహాకాళి దేవాలయంలో హోమం నిర్వహించారు. అలాగే గోలేటి గ్రామ పంచాయతీ పరిధిలోని దుబ్బగూడలో దుర్గా దేవికి ప్రేత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. గోలేటి గ్రామంలో దుర్గా మాటకు మహిళలు కుంకుమ పూజలు నిర్వహించారు.  అలాగే గోలేటి 1 గని, దొర్లి ఓపెన్ కాస్ట్ ల వద్ద కార్మికులు దుర్గా మాతకు  ప్రేత్యేకపూజలు నిర్వహించి  అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఆయా కార్యక్రమాలలో ఏరియా జీఎం  రవిశంకర్, సేవాసమితి అధ్యక్షురాలు అనురాధ రవిహాన్కార్, టిబిజికెఎస్ ఏరియా ఉపాధ్యక్షులు మల్రాజ్ శ్రీనివాస రావు, జడ్పీటీసీ బాబు రావు,  అధికారులు, కార్మికులు , ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు. 






No comments:

Post a Comment