కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన అక్టోబర్ 28 ; ఎన్నికలు దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చెక్ పోస్టులో వాహనాలను ప్రత్యేక శ్రద్ధతో కుణ్ణంగా పరిశీలించాలని కుమ్రంభీం జిల్లా డిఎస్పీ సత్యనారాయణ సూచించారు. జిల్లా ఎస్ పి మల్లారెడ్డి ఆదేశాల మేరకు రెబ్బెన పోలీస్ స్టేషన్ పరిధిలోని గోలేటి ఎక్స్రోడ్ వద్ద ఏర్పాటు చేసిన ఎలక్షన్ చెక్ పోస్టు వద్ద జిల్లా ఎస్ పి మల్లారెడ్డి ఆదేశాల మేరకు వాహనాలు తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైపు ఉండి ఆసిపాబాద్ వెళ్లే వాహనాలను క్షుణ్ణంగా పరిశీలన తనిఖీ చేశారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని చెక్ పోస్టుల వద్ద విధులు నిర్వహించే పోలీస్ సిబ్బందికి పలుసూచనలు చేశారు. వాహనతనిఖీలు అత్యంత పారదర్శంగా చేపట్టాలని సూచించారు. ప్రతి వాహనాన్ని పరిశీలించి పిదపే చెక్ పోస్టులో నుండి వదలాలని అన్నారు. ఓటర్లు ప్రభావితం చేసేలా డబ్బు, మద్యం అక్రమ రవాణా కాకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు వాహనాల్లో ఎలాంటి ఆధారాలు లేకుండా డబ్బు రవాణా చేస్తే వెంటనే పట్టుకుని పోలీసులు ఉన్నతాధికారులు ఎలక్షన్ ప్రత్యేకాధికారులకు తెలియజేయాలన్నారు చెక్ పోస్టులో విధులు నిర్వహించే సిబ్బంది తమ విధుల పట్ల నిర్లక్ష్యం వహించరాదన్నారు ఈ వాహనాల తనిఖీల్లో రెబ్బెన సిఐ వివి రమణమూర్తి ఎస్సై దికొండ రమేష్ తో పాటు తదితర పోలీస్ సిబ్బంది ఉన్నారు.
No comments:
Post a Comment