Tuesday, 2 October 2018

మహాత్ముని సూక్తిని ప్రతి ఒక్కరు పాటించాలి ; తహశీల్ధార్ సాయన్న

 కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ; అక్టోబరు  2 ;  ప్రతి మనిషి సాటి మనిషికి ఎంతో   కొంత మేలు చేయాలి  అన్న మహాత్ముని సూక్తిని ప్రతి ఒక్కరు పాటించాలని  రెబ్బెన  తహశీల్ధార్  సాయన్న   అన్నారు . మంగళ వారం  స్థానిక రెబ్బన తహశీల్ధార్ కార్యాలయములో జాతి పిత  మహాత్మా గాంధీ జయంతి వేడుకలను  ఘనంగా నిర్వహించారు . గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేశారు . ఆయన మాట్లాడుతూ ఈనాటి యువత సత్ప్రవర్తనతోనే  దేశప్రగతి ముడిపడి ఉందని అన్నారు.  . నవ సమాజములో యువత పాత్ర చాల ముఖ్యమని , క్రమశిక్షణతో ఉండాలని  , సమాజానికి పనికి వచ్చే పనులు  చేయాలని తెలిపారు . ఈ కార్య క్రమములో  తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది ,రెవిన్యూ  ఇనస్పెక్టర్  ఊర్మిళ , సెనిర్ అసిస్టెంట్ లక్ష్మీనారాయణ, మండల కో ఆప్షన్ సభ్యులు జాకిర్ ఉస్మాని, బొమ్మినేని సత్యనారాయణ,  వి ఆర్ ఓ మల్లేష్, శ్రీనివాస్, జహూర్,  స్థానిక నాయకుల తదితరులు ఉన్నారు .

No comments:

Post a Comment