Friday, 26 October 2018

గుడుంబా తయారీ స్థావరాలను ధ్వంసం

 కొమురంభీం ఆసిఫాబాద్  రెబ్బెన అక్టోబర్ 26 ; రెబ్బెన మండలం సింగల్ గూడ  గ్రామంలో  శుక్రవారం మద్యపాన నిషేధ శాఖ అధికారులు దాడి చేసి  గుడుంబా తయారీ  స్థావరాలను ధ్వంసం చేసినట్లు  ఆబ్కారీ సర్కిల్ ఇన్సపెక్టర్  మౌసీన్ అలీ తెలిపారు. జిల్లా ఆబ్కారీ అధికారి రాజ్యలక్ష్మి ఆదేశానుసారం ఈ దాడులు నిర్వహించినట్లు తెలిపారు. ఈ దాడులలో గుడుంబా తయారీకి వాడే 80 కిలోల  బెల్లం,100 లీటర్ల బెల్లం పానకం , 20 లీటర్ల గుడుంబా, 24 90 ఎం ఎల్ ఆఫీసర్ ఛాయస్, 5 బీర్ బాటిళ్లను  ఇతర సామాగ్రి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటువంటి నిషేదిత మద్యాలను తయారీ చేయకూడదని అన్నారు. చట్టాన్ని అధిగమించిన వారికి కఠిన శిక్షలు ఉంటాయని అన్నారు. ఈ దాడులలో  ఎస్సై విజయలక్ష్మి, హెడ్ కాన్స్టేబుల్  అశోక్,  ఇస్ఫాక్ ఖురేషి, రమేష్, కిరణ్, సురేష్, రవి , తిరుపతి , నాగరాజు, మమతా, తిరుపతి  పాల్గొన్నారు. 

No comments:

Post a Comment