Saturday, 20 October 2018

ఈవీఎం యంత్రాల పై అవగాహన కార్యక్రమం

కొమురంభీం ఆసిఫాబాద్  రెబ్బెన అక్టోబర్  20: ప్రతి ఒక్కరు ఈవీఎం యంత్రాల పై అవగాహన పెంచుకొని ఓటు హక్కు ను వినియోగించుకోవాలని రెబ్బెన మండల రెవిన్యూ ఇనస్పెక్టర్  ఊర్మిళ అన్నారు. రెబ్బెన మండల నంబాల గ్రామంలో ప్రజలకు     ఎన్నికలలో ఉపయోగించే ఈ వి   ఎం, వి వి ఫాట్ యంత్రాలపై  గ్రామపంచాయతీ కార్యాలయం లో జరిగిన కార్యక్రమంలో  యంత్రాల వినియోగ విధానం  పై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment