కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన అక్టోబర్ 20: ప్రతి ఒక్కరు ఈవీఎం యంత్రాల పై అవగాహన పెంచుకొని ఓటు హక్కు ను వినియోగించుకోవాలని రెబ్బెన మండల రెవిన్యూ ఇనస్పెక్టర్ ఊర్మిళ అన్నారు. రెబ్బెన మండల నంబాల గ్రామంలో ప్రజలకు ఎన్నికలలో ఉపయోగించే ఈ వి ఎం, వి వి ఫాట్ యంత్రాలపై గ్రామపంచాయతీ కార్యాలయం లో జరిగిన కార్యక్రమంలో యంత్రాల వినియోగ విధానం పై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment