కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ; అక్టోబరు 2 ; బెటర్ యూత్ బెటర్ సొసైటీ సేవా సంస్థ ఆధ్వర్యంలోరెబ్బెన మండలం గోలేటి లోని ఆశ్రమ పాఠశాలలో మహాత్మా గాంధీ,లాల్ బహదూర్ శాస్త్రి ల జయంతి సందర్భంగా చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు ఓరగంటి రంజిత్ రంజిత్ మాట్లాడుతూ యువత సన్మార్గంలో నడిచి స్వాతంత్య్ర సమరయోధులను ఆదర్శంగా తీసుకుని వారి అడుగు జాడల్లో నడవాలని కోరారు. అనంతరం ఈ కార్యక్రమంలో పాఠశాల వార్డెన్ దేవయ్య ,మరియు సంస్థ ఉపాధ్యక్షులు నామాల రాజశేఖర్, కార్యదర్శులు గజ్జల సత్యనారాయణ , తిరుపతి , రాజశేఖర్, పాఠశాల సిబ్బంది,విద్యార్థులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment