ఈవీఎం యంత్రాల పై అవగాహన పెంచుకొని ఓటు హక్కు ను వినియోగించుకోవాలి
కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన అక్టోబర్ 11: ప్రతి ఒక్కరు ఈవీఎం యంత్రాల పై అవగాహన పెంచుకొని ఓటు హక్కు ను వినియోగించుకోవాలని జిల్లా ఉద్యానవన అధికారి స్పెషల్ ఆఫీసర్ మెహర్ బాషా అన్నారు. గురువారం మాధవాయిగూడ ,తుంగేడ గ్రామప్రజలకు ఎన్నికలలో ఉపయోగించే ఈ వి ఎం, వి వి ఫాట్ యంత్రాలపై గ్రామపంచాయతీ కార్యాలయం లో అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిధి గాహాజరయ్యారు. . ఈ సందర్భంగా రెబ్బెన రెవిన్యూ ఇన్సపెక్టర్ రేణుక యంత్రాల వినియోగ విధానం పై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment