Saturday, 27 October 2018

సామూహిక శ్రీమంతం వేడుక

రెబ్బెన ;   రెబ్బెన మండలం పులికుంట గ్రామం అంగన్వాడీ పాఠశాలలో గర్భిణీ స్త్రీలకు సామూహిక శ్రీమంతం వేడుకను ఐసీడీఎస్  ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా గౌతమి మండల సమాఖ్య  బి లక్ష్మి మాట్లాడుతూ  గర్భిణీ స్త్రీలు పౌష్టికాహారం తీసుకోవాలని, పండు, ఆకుకూరలు తీసుకోవాలని అన్నారు. మన సంప్రదాయాన్ని అనుసరించి గర్భిణులకు శ్రీమంతం జరపడం ఆనవాయితీ అని ఈ వేడుక జరపడం ద్వారా గర్భిణులకు పండంటి  బిడ్డ పుట్టాలని ముత్తైదువులు దీవిస్తారని అన్నారు.  ఈ కార్యక్రమంలో పులికుంట గ్రామానికి చెందిన ఈ తిరుపతమ్మ, ఈ మమత లకు పలువురు ముత్తైదువులు స్వీట్లు తినిపించి దీవించారు.  ఈ కార్యక్రమంలో అంగన్వాడీ ఉపాధ్యాయులు ఈ స్వప్న, సహాయకురాలు బాయక్క,గ్రామస్తులు  తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment