కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన అక్టోబర్ 29 ; రెబ్బెన మండల కేంద్రంలో తెరాస పార్టీ ఎన్నికల కార్యాలయాన్ని సోమవారం తాజా మాజీ ఎం ఎల్ ఏ కోవలక్ష్మి ప్రారంభించారు. అనంతరం మండలంలోని నంబాల, నార్లాపూర్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారకార్యక్రమాన్ని నిర్వహించారు. గత నాలుగు సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కెసిఆర్ ఆధ్వర్యంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా చేపట్టిందన్నారు. గతంలో ఎన్నడు లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు. ముఖ్యంగా మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలతో పాటు రైతు బందు, కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, గొర్రెల పంపిణీ, చేప పిల్లల పంపిణీ, వృద్ధులకు వికలాంగులకు ఒంటరి మహిళల పెన్షన్లు పెంచి ఇవ్వడం జరుగుతోందని రానున్న ఎన్నికల్లో తెరాస ను గెలిపిస్తే మరిన్ని ప్రజా సంక్షేమ కార్యక్రమాలను చేపడతామని , నిరుద్యోగ భృతి కల్పిస్తామని రైతు బందు సహాయాన్ని పెంచుతామని హామీ ఇచ్చారు. టిఆర్ఎస్ ను ఓడించాలనే ఉద్దేశ్యంతో భావ సారూప్యం లేని నాలుగు పార్టీలు కలిసి మహాకూటమి పేరుతో ఎన్నికలకు వస్తున్నాయన్నారు. అది మహాకూటమి కాదని మాయా కూటమి అని వారిని గెలిపిస్తే రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడుతుందని అన్నారు. గత నాలుగు సంవత్సరాలుగా నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేస్తున్నామన్నారు . ముఖ్యంగా కొమరంభీం జిల్లాలో జిల్లా ను సాధించి ప్రజల వద్దకే పాలన తీసుకురావటం జరిగిందని అన్నారు. గ్రామాల్లో సిసి రోడ్లు నిర్మించామన్నారు. ఈసారి ఎన్నికల్లో గెలిపిస్తే నియోజక వర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సంజీవ్ కుమార్,,జడ్పీటీసీ బాబు రావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి , మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షురాలు శంకరమ్మ,టిబిజికేస్ ఏరియా ఉపాధ్యక్షులు శ్రీనివాస రావు, నవీన జైస్వాల్, సోమశేఖర్, రాజేశ్వర్రావు, , చిరంజీ గౌడ్,పెసర వెంకటమ్మ, పెసర మధునయ్య, మన్యం పద్మ, సురేష్ జైస్వాల్, సుదర్శన్ గౌడ్, మాణిక్యా రావు, తదితరులు ఉన్నారు.
No comments:
Post a Comment