ఉపాధ్యాయ పోస్ట్లు భర్తీ చేయాలి
కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి). సుప్రీం కోర్ట్ తీర్పు ప్రకారం జిల్లాలోని ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలనీ డి . ఈ. డి మండల అధ్యక్షుడు ఆత్రం తిరుపతి బుధవారం నాడు రెబ్బెన తహశీల్ధార్ రమేష్ గౌడ్ కి వినతిపత్రం అందచేశారు అనంతరం మాట్లాడుతూ ప్రణాళిక ప్రకారం డి.ఎస్.సి. నిర్వహించాలని అలాగే టెట్ వెయిటేజ్ ను ఉంచుతూ డి.ఎస్.సి సిలబస్ ను ప్రకటించాలన్నారు ప్రభుత్వ పాఠశాలలను మూసివేతను విరమించుకోవాలని అన్నారు. ఈ సందర్బంగా తహశీల్ధార్ రమేష్ గౌడ్ మాట్లాడుతూ ఉన్నత అధికారులకు తెలియజె స్తాం అన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు రాజేశం కోశాధికారి సత్యనారాయణ చారి ప్రధాన సలహాదారులు దుర్గం రాజ్ కుమార్, శ్యా0రావు మహేందర్ రాము సురేష్ లు పాల్గొన్నారు.
No comments:
Post a Comment