ఏఐటీయూసీ కొమురంభీం జిల్లా అధ్యక్షుడిగా ఎస్.తిరుపతి
కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి) ఏఐటీయూసీ
కొమరం భీం జిల్లా అధ్యక్షుడిగా రెబ్బెన మండలం గోలేటి చెందిన ఎస్.తిరుపతి ని ఎన్నుకోవడం జరిగింది . గత కొన్ని సంవత్సరాల నుండి పార్టీ కోసం పాటుపడుతూ సింగరేణి కార్మికు ల సమస్యలను పరిష్కరిస్తూ గతం లో గోలేటి బ్రాంచ్ సెక్రెటరీ గా కొనసాగుతూ అలాగే జిల్లా కార్యవర్గ సభ్యులు గా ఉంటూ పార్టీ తరపున కార్మికులకు చేదోడు వదుడుగా ఉంటూ కార్మికుల ప్రతిఒక్క సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేసినందుకు పార్టీ అధిష్టానం గుర్తించి జిల్లా అధ్యక్షుడిగ ఎన్నుకున్నారు. ఈ సందర్బం గ ఎస్ తిరుపతి మాట్లాడుతూ మా ఊపిరి ప్రాణంగా పెట్టి కార్మికుల శ్రేయస్సు కోసం అనునిత్యం పార్టీ తరుపున పోరాడతాం అని అన్నారు . ఈ సందర్బంగ సిపిఐ,ఏఐటీయూసి,ఎ ఐ వై ఎఫ్,ఎ ఐ ఎస్ ఎఫ్, నాయకులు హర్షం వ్యక్తపరిచారు.
No comments:
Post a Comment