రైతులకు చెనగ విత్తనాల పంపిణి
కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి) రెబ్బన మండల సహకార కేంద్రం లో సోమవారం నాడు రైతులకు చెనగ విత్తనాలు రెబ్బవేనా మండల ఎంపిపి కార్నాథం సంజీవ్ కుమార్,సహకార సంఘ ఛైర్మెన్ గాజుల రవీందర్,మార్కెట్ కమిట ఉపాధ్యక్షురాలు కుందారపు శంకరమ్మ పంపిణి చేసారు.అనంతరం వారు మాట్లాడుతూ మండలం లోని రైతులకు 600 చెనగ విత్తనాల బస్తాలు ప్రభుత్వం పంపిణి చేయడం జరిగిందని అన్నారు. రైతులు నకిలీ విత్తనాలు కొని మోసపోవద్దని ప్రభుత్వం అందచేసిన విధానాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమం లో రెబ్బెన సర్పంచ్ పెసారు వెంకటమ్మ,గంగాపూర్ సర్పంచ్ రవీందర్ ,వ్యవసాయ అధికారి మార్క్,నాయకులు పెసరు మధునయ్య ,రైతులు బోయిని శంకరమ్మ,సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment