కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి) సింగరేణి కాంట్రాక్టు కార్మికులు ఈ నెల 11,12 తేది లలో 48 గంటల టోకెన్ సమ్మెను కాంట్రాక్ట్ కార్మికులు అధికసంఖ్యలొ పాల్గొని విజయవంతం చేయగలరని ఎ ఐ టి యు సి బ్రాంచ్ అద్యక్యుడు బోగే ఉపేందర్ అన్నారు. ఆదివారం రెబ్బెన మండలం లోని గోలేటి సి పి ఐ కార్యాలయంలో గోడపత్రాలను విడుదలచేశారు . అనంతరం సమావేశంలో మాట్లాడుతూ హెచ్ పి సి వేతనాల గురించి బోనసులు ఎన్ సి డబ్ల్యూ ఎ వర్తింపుల పై మరియు కాంట్రాక్ట్ కార్మికుల పర్మినేట్ చేయడం కొరకు పర్మింట్ కోటర్స్ తదితర సమస్సలపై సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జె ఏ సి చేపట్టే టోకెన్ సమ్మెను విజవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు చల్లూరి అశోక్ మండల అధ్యక్షులు రాయిల్ల నర్సయ్య బానోత్ కిషన్ ,ఐ ఎఫ్ టి యూ ప్రెసిడెంట్ తిరుపతి నాయకులు చంద్రయ్య , పోషం , సికిందర్ తదితరులు పాల్గొన్నారు..
No comments:
Post a Comment