ముదిరాజ్ల ఫై చిన్న చూపు తగదు - శ్రీనివాస్ ముదిరాజ్
కొమురం బీమ్ (వుదయం ప్రతినిధి) ముదిరాజ్ ఫై పాలక వర్గం చిన్నచూపు చూస్తూ ప్రభుత్వం వివక్షత చూపుతుందని తెలంగాణ ముదిరాజ్ రాష్ట్ర నేత గుండ్లపల్లి శ్రీనివాస్ అన్నారు , శుక్రవారం రెబ్బెనలో ఏర్పాటు చేసిన ముదిరాజ్ సమావేశం లో మాడ్లాడుతు డిసెంబర్ రెండు నుండి పద్దెనిమిది వరకు కొనసాగే మహాపాద యాత్ర ని విజయవంతం చేయలని పిలుపునిచ్చారు ఈ మహా పాద యాత్ర ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వరకు జరుగుతుంద్దన్నారు ,ఈ సందర్బంగా మహాపాదయాత్ర పోస్టర్ లను ఆవిష్క రించారు ఈ సమావేశంలో జిల్లా కన్వీనర్ తోట లక్ష్మణ్ ముదిరాజ్ కో కన్వీనర్ పెసరి మధునయ్య, ముదిరాజ్ అద్వర్యం లో నిర్వహించిన సమావేశంలో నాయకులు మాట్లాడుతూ బిసి డి లోంచి బీసీ ఏ లోకి మార్చాలని డిమాండ్ చేసారు ప్రభుత్వం ఇకనైనా మదిరాజ్ లను గుర్తించి ప్రభుత్వ ప్రయోజనాలను అందేలా చూడాలని అన్నారు నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. ముదిరాజ్ ల కులవృత్తికై ప్రభుత్వం అమలు చేసే ఫలాలను అర్హులైన వారికీ అందించి వారి పురొఅభివృద్ధికి దోయత పడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘ మహాసభ నాయకులు ,పేట మల్లయ్య ,మండలా అధ్యక్షులు శరత్ ముదిరాజ్,సంగం నాయకులు తీగల శ్రీనివాస్ ,అంకం పాపయ్య ,మూడెడ్ల శ్రీనివాస్ ,అంకం సందీప్,పోతురెడ్డి రమేష్ ,మూడెడ్ల రమేష్ ,తదితరులు పాల్గొన్నరు.
No comments:
Post a Comment