ముదిరాజ్ ల మహా యాత్ర పోస్టర్ల విడుదల
కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి) రెబ్బెన మండలంలో ముదిరాజ్ యూత్ మహా పాద యాత్ర హలో ముదిరాజ్ చలో హైదరాబాద్ పోస్టర్లను విడుదల చేశారు . ఈ సందర్బంగా జిల్లా నాయకులు ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు పెసరు మధునయ్య ముదిరాజ్ మాట్లాడుతూ ముదిరాజ్ లను బి సి డి నుండి బి సి ఏ కులమునకు మార్చాలని అన్నారు .బి సి ఏ లో కలపడం వాళ్ళ యువతకు ఉపాధి కల్గుతుందని ,యువతకు రుణ సదుపాయం,కల్పించాలని అన్నారు ఈ మహా పాద యాత్ర డిసెంబర్ 2 నుండి 18 వరకు ఆదిలాబాద్ నుండి హైదరాబాద్ వరకు కొనసాగుతుందని అన్నారు జిల్లా యువజన ఆధ్వర్యములో చలో హైదరాబాద్ నిర్వహిస్తున్నట్లు తేలిపారు. . హైద్రాబాద్ లోఇందిరాపార్క్ లో నిర్వహించే బారి బహిరంగ మహా సభకు ముదిరాజ్ కులస్తులందరు అధిక సంఖ్యలో తరలిరావాలని ఆయన అన్నారు . ఈ కార్య క్రమములో ముదిరాజ్ సంఘం నాయకులు ముల్కల్లపల్లి వెంకటేశ్వర్లు , అంకం పాపయ్య ,మూడెడ్ల శ్రీనివాస్ ముదిరాజ్ తోట లక్మన్ , అంకం స్వామి ముదిరాజ్ , పేట మల్లయ్య , రమేష్ , సందీప్, పోతిరెడ్డి రమేష్ ,ఎర్రం మల్లేష్ లు ఉన్నారు.
No comments:
Post a Comment