కమ్యూనిటీ హల్ కోసం స్థలం కేటాయించండి
కొమురం బీమ్ (ఆసిఫాబాద్ ) రెబ్బెన: (వుదయం ప్రతినిధి): రెబ్బెన మండల కేంద్రములో కమ్యూనిటీ హాల్ , షాదీఖానా కోసం స్థలాన్ని కేటాయించాలని కో ఆప్సన్ సభ్యుడు జాకీర్ ఉస్మాని అన్నారు . సోమా వారము రెబ్బెన తహశీల్ధార్ రమేష్ కు వినతి పత్రాన్ని అందజేశారు . గతములో మంత్రి జోగు రామన్నకు వినతి అందజేశామని , జారీచేసిన పత్రాన్ని తహశీల్ధార్ కు చూపించారు . అదే విదంగా ఎం ఎల్ ఏ కోవా లక్ష్మి , ఎం ఎల్ సి పురాణం సతీష్ కుమార్ దృష్టికి తీసుకెళ్లగా వారు కూడా ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని తెలిపారు . స్థలాన్ని తప్పకండా కేటాయించాలని అన్నారు . ఈ కార్య క్రమములో అన్వార్ , అప్పు తదితరులు వున్నారు
No comments:
Post a Comment