తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలోఘనముగా బతుకమ్మ సంబరాలు
(రెబ్బెన వుదయం ప్రతినిధి); తెలంగాణ సాంప్రదాయ పండుగ అయిన బతుకమ్మ వేడుకలు రెబ్బెన మండలంలోని అతిధి గృహములో మహిళాలు శుక్రవారం రోజున తెలంగాణ జాగృతి యూత్ కో కన్వీనర్ రంగు మహేష్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలలో మహిళలు ఘనముగా బతుకమ్మ పాటలు పడుతూ ఆటలు ఆడారు . తెలంగాణ సంప్రదాయక పద్దతిలో పలువురిని ఆకట్టుకున్నరు ఇందులో భాగంగా బతుకమ్మ సంబరాలు జరుపుకోడానికి మహిళలు ప్రత్యేక పూలతో బతుకమ్మలను అలంకరించారు ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మను జరుపుకున్నారు. అనంతరం ఉత్తమ బతుకమ్మలకు బహుమతులు అందచేశారు ఈ బతుకమ్మ వేడుకల్లో ఏ ఎం సి వైస్ చైర్ మెన్ కుందారపు శంకరమ్మ, సర్పంచ్ పెసరు వెంకటమ్మ ,వైస్ ఎం పి పి గుడిసెల రేణుక, బాలమ్మ, జడ్పిటిసి బాబురావు, ఎంపీపీ కార్నాధం సంజీవ్ కుమార్ ,తహసీల్దార్ రమేష్ గౌడ్, ఎం ఈ ఓ వెంకటేశ్వర స్వామి, ఏ పి ఎం వెంకటరమణ, ఉప సర్పంచ్ బొమ్మినేని శ్రీధర్, సింగిల్ విండో డైరెక్టర్ మదనయ్య, సుదర్శన్ గౌడ్, చిరంజీవి గౌడ్, సోమశేఖర్, నవీన్ జైస్వాల్, దుర్గం సోమయ్య, తెలంగాణ జాగృతి నాయకులు ప్రవీణ్, ఆవడపు గోపి, వెంకన్న, వినయ్,భీమేష్, నవీన్, శ్రీకాంత్ ,రాజకుమార్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నరు.
No comments:
Post a Comment