రైతులకు అందుబాటులో ఉంటూ సకాలంలో సేవలు అందించాలి ; జె.సి అశోక్ కుమార్
కొమురం బీమ్ (ఆసిఫాబాద్ ) రెబ్బెన: (వుదయం ప్రతినిధి): అధికారులు అందుబాటులో వుంటూ సకాలంలో రైతులకు సేవలు అందించాలని జె.సి అశోక్ కుమార్ అన్నారు ఆదివారం రెబ్బెన తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులు పరిశీలించి కార్యాలయ సిబ్బందిని పరిసరాల యొక్క రైతుల పంటల వివరాలు తెలుసుకున్నారు . అలాగే పరిసర ప్రాంతాలలోని ప్రోజెక్టుల వివరాలు అడిగి తెలుసుకున్నారు . మిషన్ కాకతీయ చెరువుల వివరాలు ఆరాతీసారు . కుమ్రo భీం జిల్లా నూతనంగా ఏర్పడిన తరువాత మొదటి సరిగా ఉప పాలనాధికారి రెబ్బెన తహసీల్దార్ కార్యాలయం విచ్చేసినందుకు పూల గుచ్చాలతో స్వాగతం పలికారు . ఈ సందర్బంగా రెబ్బెన తహసీల్దార్ రమేష్ గౌడ్ , డిప్యూటీ తహసీల్దార్ రామ్ మోహన్ రావు , జూనియర్ అసిస్టెంట్ ఊర్మిళ మరియు కార్యాలయ సిబ్బంది బాపన్న,ఉమ్ లాల్ తదితరులు ఉన్నారు.
No comments:
Post a Comment