Saturday, 22 October 2016

ఏ ఐ టి యూ సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భానుదాస్


సమస్యలు పరిష్కరించకుంటే బొగ్గు ఉత్పత్తిని ఆపుతాం
  
          ఏ ఐ టి యూ సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భానుదాస్  



(రెబ్బెన వుదయం ప్రతినిధి);  కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిస్కారించకుంటే సింగరేణి మొత్తం బొగ్గు ఉత్పత్తి స్తంభింప చేస్తామని ఏ ఐ టి యూ సి రాష్ట్ర ప్రధాన కార్య దర్శి భాను దాస్ అన్నారు . శనివారం గోలేటి లోని జి  ఎం కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు . అనంతరం మాట్లాడారు . సింగరేణిలో గత 15 సం,, నుంచి పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులను కాంట్రాక్టరు మార్చినంత మాత్రన కార్మికులను మర్చరాదని ,కార్మికుల సకల జనుల సమ్మె  వేతనాలు చెల్లించాలని సింగరేణి  కాంట్రాక్టు వర్కర్స్‌ మాట్లాడుతూ సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు కొనసాగించాలని, సకల జనుల సమ్మెలో పాల్గొన్న కార్మికులకు వడ్డీతో సహా వేతనాలు చెల్లించాలని,  తెలంగాణ రాష్టంలో నిస్వార్ధంగా 35 రోజులు పాటు సమ్మెలో పాల్గొన్న  కాంట్రాక్టు కార్మికులకు  వేతనాలు ఇవ్వాలని,   . ఆసుపత్రి అవసరం కొరకు పుస్తకాలు అందరికి ఇవ్వాలని అన్నారుకార్మికులను పర్మినెంట్ చేయాలని అన్నారు .  ఇప్పటికి అయినా రాష్ట్ర ప్రభుత్వం ,  సింగరేణి యాజమాన్యంమీద ఒత్తిడి తెచ్చి కంట్రాక్టర్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో రీజినల్ అధ్యక్షుడు బోగే ఉపేందర్ , నాయకులు బ్రహ్మానందం ,  గోలేటి బ్రాంచి కార్యదర్శి చల్లూరి అశోక్, ఉపాధ్యక్షుడు లేకురి సుధాకర్, సహాయ కార్యదర్శిలు అర్ మల్లేష్, కుమార్, రాంకుమార్ పాల్గొన్నారు.

No comments:

Post a Comment