Saturday, 15 October 2016

రెబ్బెన ఆటో డ్రైవర్ మృతి - అనాథలైన పిల్లలు

రెబ్బెన ఆటో డ్రైవర్ మృతి - అనాథలైన పిల్లలు    
కొమురం బీమ్ (ఆసిఫాబాద్ )                      రెబ్బెన: (వుదయం ప్రతినిధి)   రెబ్బెన మండల కేంద్రానికి చెందిన గోగర్ల రమణయ్య  (46 )ఆటో డ్రైవర్ విష జ్వరముతో శనివారం మృతి చెండాడు . మృతుడు రమణయ్య కు గత  2 రోజులుగా విష జ్వరముతో కాగజ్ నగర్ ఆసుపత్రికి , అనంతరం శనివారం కరీంనగర్ కు తరలిస్తూ ఉండగా మృతి చెందినట్లు బంధువులు  తెలిపారు . మృతుడి అన్న వదిన మృతి చెందడముతో వారి పిల్లలను , కుటుంబాన్ని పోషించాడు . రమణయ్య మృతి చెందడముతో పిల్లలు అనాథలయ్యారు . మృతుడి కుటుంబాన్ని జెడ్ పి  టి సి బాబు రావు తో పాటు ఆటో యూనియన్ నాయకులు పరామర్శించారు .  రమణయ్య మృతికి సంతాప ము తెలుపుతూ ఆది వారం నాడు ఆటోలు బంద్  పెడుతున్నట్లు ఆటో నాయకులు తెలిపారు.

No comments:

Post a Comment