కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన జులై 05 ; కేంద్ర ప్రభుత్వం రైతులకు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి రైతులకు మద్దతు ధర ప్రకటించిందని బిజెపి మండల అధ్యక్షుడు కుందరపు బాలకృష్ణ అన్నారు. గురువారం రెబ్బనలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏ ప్రభుత్వాలు చేయలేని సంక్షేమ పథకాలు కేంద్ర ప్రభుత్వం మన నరేంద్ర మోడీ ప్రవేశం పెడుతూ రైతులకు అండగా నిలిచి ఎన్నో సంక్షేమ లను ప్రవేశపెడుతూ రైతులకు మద్దతు ధరను కల్పించారని అన్నారు. రైతు శ్రేయస్సు కోసం రైతే రాజు అన్న నినాదంతో భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్తుందని అన్నారు. పత్తికి మద్దతు ధర 5150 వరి కి 1750 కందులు కి 5675 జొన్నలు కి 2490 ప్రకటించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. బీజేవైఎం మండలాధ్యక్షుడు ఇగుర్రపు సంజీవ్, టౌన్ అధ్యక్షులు మండల మధుకర్, కార్యదర్శి మల్రాజ్ శేఖర్ నాయకులు మహేష్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment