Tuesday, 31 July 2018

ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలోహరిత హారం, అరటి పళ్లు పంపిణి

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన జులై 31 ; మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో మంగళవారం సంజీవని  స్వచంద సంస్థ ఆద్వర్యం లో  ఆసుపత్రి ఆవరణలో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ప్రతి మంగళ వారం టీఆరెస్ మహిళా విభాగం  ఆద్వర్యం లో నిర్వహిస్తున్నకార్యక్రమంలో   సంజీవని స్వచ్చంద సేవ సంస్థ రేబ్బె న వారు గర్భిణులకు అరటి పళ్లు పంపిణి చేసారు.. ప్రతి  ఒక్కరు సేవ భావాన్ని కలిగి ఉండాలని, అదే విదంగా సంజీవని  స్వచ్చంద సేవ సంస్థ సభ్యులను కూడా అభినందించారు. ఈ కార్యక్రమంలో    ఎంపిపి కె . సంజీవ్ కుమార్,జడ్పీటీసీ అజ్మిరా  బాబురావు,  ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్   కుందారపు  శంకర మ్మ, సంజీవని స్వచ్చంద సంస్థ  వ్యవస్థాపకులు  దీకొంఢ సంజీవ్ కుమార్, తెరాస మండల మహిళ   అధ్యక్షురాలు మన్యం  పద్మ , కార్యదర్శి అరుణ,    సంస్థ సబ్యులు విజయ కుమారి, సుజాత ఆసుపర్తి సిబ్బంది పాల్గొన్నారు. 

No comments:

Post a Comment