కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన జులై 15 ; మండలం గోలేటిలోని తెలంగాణ భవన్ ప్రాంగణంలో టిబిజికెఎస్ కార్యాలయం టిబిజికెఎస్ ఏరియా ఉపాఢ్యక్షుడు మల్రాజ్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో హరితహారం లో భాగంగా 100 మొక్కలను నాటడం జరిగింది.గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మొదలుపెట్టిన హరిత హారం కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఈ కార్యక్రమమ్ చేపట్టడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా మల్రాజ్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి సింగరేణీయుడు ఈ వర్షాకాలంలో కనీసం ఒక మొక్కనైన నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కేంద్ర కమిటీ సభ్యుడు అబ్బు శ్రీనివాసరెడ్డి, ఏరియా నాయకులు మహేందర్ రెడ్డి,మరీనా వెంకటేష్, కుమారస్వామి, చంద్రశేఖర్, పిట్ కార్యదర్శి టి పి రాములు,నాయకులు దంకుమార్,మెకార్తి మల్లేష్,కొండు సత్తయ్య,,సాంబశివ రావు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment