Monday, 23 July 2018

సింగరేణి ఘనులలో ఈ నెల 25న మల్టి డిపార్ట్మెంట్ బృందం పర్యటన



రెబ్బెన:  
బెల్లంపల్లి  ఏరియాలో  ఖైర్గుడా, దొర్లి,ఓసి2 తదితర విభాగాల్లో మల్టి డిపార్ట్మెంట్ వారు పర్యటించి ఇప్పడివరకు సాధించిన ఉత్పత్తి ఉత్పాదకాలను రవాణా, యంత్రాల వినియోగం బొగ్గు నాణ్యత, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గూర్చి కార్మికులకు వివరించడం జరుగుతుందని  జియం కె రవి శెంకర్ అన్నారు . సోమవారం  గోలేటి లోని  సింగరేణి జియం కార్యాలయంలో  పర్యటనకు సంబందించిన గోడప్రతులను విడుదల చేసి అనంతరం కాన్ఫిరెన్సి హాలులో పవర్ ప్రజంటేషన్ ద్వారా అధికారులకు పర్యటనకు సంబందించిన పలు  సూచనలు చేసారు.ఈ నెల25 వ తేదీన డోర్లి పర్యటన,26 వ తేదీన ఖైర్గుడా,27న బిపిఎ ఓసి2,28 న అన్వేషణ విభాగం ఏరియా ఆస్పత్రి,29న బెల్లంపల్లి ఏరియా వర్క్ షాప్,జియం కార్యాలయం లలో పర్యటించి ఇప్పడివరకు సాధించిన ఉత్పత్తి ఉత్పాదకాలను రవాణా, యంత్రాల వినియోగం బొగ్గు నాణ్యత, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గూర్చి కార్మికులకు వివరించి కార్మికుల నుండి పలు సూచనలు ఈ ప్రత్యేక బృందం  స్వీకరించి  వాటి అమలుకై కృషి చేస్తామన్నారు.ఈ పర్యటన ఉదయం 7గం నుండి మధ్యాహ్నం  3 గంటల వరకు సాగుతుందన్నారు. అనంతరం బెల్లంపల్లి  ఏరియా వార్షిక ఉత్పత్తిని, లక్ష్యాలను సాధిస్తూ లాభాల బాటలో సాగుతుంది అన్నారు.లాభాలు సాధించడంలో ఉద్యోగులు,కార్మికులు ఎంతో కృషి ఉందని వారికీ ప్రత్యేక అభినందలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓటుజియం వీరస్వామి,డిజిఎం పర్సనల్ జె కిరణ్,ఎస్వో కె సాయి బాబు,డిప్యూటీ జియం సీతారామన్,ఎస్వోయం కె రాజమల్లు,ఐఈడి యోహాన్,ఫైనాన్స్ మేనేజర్ శ్రీధర్. మల్టి డిపార్ట్మెంట్  బృందం వారితో పై అధికారులందరు పాల్గొననున్నట్లు జియం రవి శెంకర్ తెలిపారు.  

No comments:

Post a Comment