Saturday, 21 July 2018

రోడ్ల దుస్థితి పై పాదయాత్ర


కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన జులై 21 ;  రహదారుల నిర్వహణలో  ఆర్ అండ్ బి అధికారుల  నిర్లక్ష్యానికి నిరసనగా ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్  విద్యార్ధి యువజన సంఘాల ఆధ్వర్యంలో శనివారం తక్కళ్లపల్లి గ్రామం నుండి వాంకిడి మండల గోయిగం వరకు పాదయాత్రను చేపట్టారు.ఈ పాదయాత్రను ఆత్రం సక్కు మాజీ ఎం ఎల్ ఏ  జండా ఊపి ప్రారంభించారు.  ఈ సందర్భంగా  వారు మాట్లాడుతూ  .అంతరాష్ట్ర రహదారి,గ్రామీణ ప్రాంత రహదారులు గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా తయారైనప్పటికీ రహదారులు భవనములు శాఖ కనీసం గుంతలను పూడ్చడంకాని  చేయడం లేదని అన్నారు.   వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురై ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టం జరుగుతున్నదని అన్నారు. గ్రామీణ ప్రాంతాలలో రోడ్ల పరిస్థితి మరి దయనీయంగా ఉందని గ్రామాలకు చేరుకోలేని పరిస్థితి ఉందని అన్నారు.ఈ ర్యాలీలో దుర్గం రవీందర్, ఎస్ తిరుపతి, చునార్కర్ మహేందర్ ,పిమహేష్, మొర్లే శ్రీకాంత్, పుదారి సాయి, పార్వతి సాయి, జాడి సాయి, దుర్గం రాజేష్, గోగర్ల రాజేష్,  తదితరులు పాల్గొన్నారు.  

No comments:

Post a Comment