Tuesday, 31 July 2018

అవిశ్వాస తీర్మానం పై ఆగష్టు 9 న సమావేశం


కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన జులై 31 ; రెబ్బెన మండల పరిషత్ ఎం పి  పి  కర్నాధం సంజీవ్ కుమార్ పై ఎంపీటీసీ లు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం పై  ఆగష్టు 9 న ఉదయం 11 గంటలకు  సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ సత్యనారాయణ సింగ్ తెలిపారు. ఈ మేరకు ఎంపీటీసీ లు  జి రేణుక, ఏం సురేంద్రరాజు, టి మంగమ్మ , కే శ్రీనివాస్,  పల్లె  అనిత, మురళి బాయి, వర్ష బాయి లకు మంగళవారం  ఎంపీడీఓ కార్యాలయంలో సమావేశ నోటీసులను  సీనియర్ అసిస్టెంట్ వాసు  అందచేశారు. ఎంపీటీసీ లు అందరు తప్పక ఈ సమావేశానికి హాజరు కావాలని కోరారు. ఆర్ డి ఓ కదం సురేష్ అధ్యక్షతన ఈ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు.   





No comments:

Post a Comment