కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన జులై 14 ; బెల్లంపల్లి ఏరియా గోలేటి లోసింగరేణి సేవా సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్ కు చెందిన మాతా రీసెర్చ్ సెంటర్ కు చెందిన విశ్వనాథ మహర్షి సహకారంతో ఈ నెల 16 న ఆయుర్వేద శిబిరం నిర్వహించబడునని డీజీఎం పెర్సొన్నల్ జె కిరణ్ ఒక ప్రకటనలో శనివారం తెలిపారు. ఈ శిబిరం ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారని,మానవ శారీరంలో పిత్తం,వాతం , శ్లేషం అనేవి ముఖ్యమని వాటిని నియంత్రణలో ఉంచుకుంటే ఆరోగ్యమని , ఈ సదవకాశాన్ని కార్మికులు, సభ్యులు ఉపయోగించుకోవాలని అన్నారు.
No comments:
Post a Comment