రెబ్బెన: గ్రామంలోని ప్రజలందరు కుల మతాలకు అతీతంగా సోదరభావం తో మెలగాలని జిల్లా పాలనాధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్, జిల్లా ఎస్పీ కల్మేశ్వర్ సింగెనవార్ లు అన్నారు. సోమవారం రెబ్బెన మండలంలోని కొండపల్లి గ్రామంలో మానవ హక్కుల పరిరక్షణలో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఇటీవల జరిగిన ఇరువర్గాల పరినామాలపై స్పందించని జిల్లా పాలనాధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్,జిల్లా ఎస్పీ కల్మేశ్వర్ సింగెనవార్ కొండపల్లి గ్రామాన్ని సందర్శించి ఇరువర్గాల ప్రజలతో మాట్లాడి గ్రామంలో సుహురుద్బవ వాతావర్ణనని కల్పించడానికి ప్రయత్నం చేసారు. అనంతరం వారు మాట్లాడుతు గ్రామంలోని ప్రజలందరు కుల మతాలకు అతీతంగా సోదరభావం తో మెలగాలని గ్రామంలో ప్రశాంత వాతావర్ణనాన్ని కల్పించుకొని ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని హితవు పలికారు.ప్రజలందరు రాజ్యాంగ బద్దంగా జీవిస్తు వేరొకరి హక్కులకు భంగం కలిగించకుండా జీవనం కొనసాగించాలని కోరారు. అనంతరం జ్యోతిబాపూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రెబ్బెన తహసీల్దార్ సాయన్న,ఎంపీడీవో సత్యనారాయణ సింగ్, సిఐ రమణమూర్తి, ఎంపిపి సంజీవ్,తదితర అధికారులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment