కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన జులై 10 ; రెబ్బెన మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తెరాస మహిళా విభాగం నుంచి మన్యం పద్మఆధ్వర్యంలో మంగళవారం గర్భిణీ స్త్రీలకు అల్పాహారం పంపిణి చేసారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతు. మండలంలోని వివిధ గ్రామాలనుంచి వచ్చే గర్భిణీ స్త్రీలకు ప్రతి మంగళవారం అల్పాహారం పంపిణి కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. తెరాస మహిళా విభాగం తరుపున భవిష్యత్ లో మరిన్ని మంచి కార్యక్రమాలు చేపడతామన్నారు.ఈ కార్యక్రమానికి ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మెన్ కుందారపు శెంకరమ్మ ఆస్పత్రి సిబ్బంది ,డా:మాధవి, ,భాగ్య లక్ష్మి, రాజేశ్వరి, కాంత లీల తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment