Tuesday, 24 July 2018

మొక్కలు మానవాళికి ఎంతో మనుగడ

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన జులై 24 ; ఈ నాటి మొక్కలే రేపటి వృక్షాలని , వృక్షాలు మానవ మనుగడకు ఎంతో దోహద పడతాయని ఎస్ వి ఇంగ్లిష్ మీడియం హై స్కూల్ ప్రధానోపాధ్యాయుడు దీకొండ  సంజీవ్ కుమార్ అన్నారు . మంగళ వారం రెబ్బెన లో డిప్యూటీ రేంజర్  కారం శ్రీనివాస్ ఆధ్వర్యములో హరిత హారములో భాగంగా పాఠశాల  విద్యార్థులు , సిబ్బంది మొక్కలతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన  మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి ఒక్క మొక్క నాటాలని , అప్పుడు గ్రామమే ఉద్యాన వనముగా మారుతుందని తెలిపారు . పుట్టిన రోజు , పండగలకు గుర్తింపుగా మొక్కలు నాటుతుండాలని , పర్యావరనాన్ని కాపాడిన వారమౌతామని తెలిపారు , ఈ కార్య క్రమములో ఉపాధ్యాయులు విజయ కుమారి , సుజాత , ఉదయ , రేష్మ , విష్ణు, ఆనంద్ రావు , తిరుపతి, లిఖిత, ప్రమీల, భాగ్యలక్ష్మి లతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.

1 comment: