Thursday, 26 July 2018

గ్రామా బహిష్కరణ చేస్తూ డప్పు చాటింపు వేయటం అమానుషం ; కడ్తల మల్లయ్య


కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన జులై 26 ;  కొండపల్లి గ్రామంలో నాయి బ్రాహ్మణా, రజకులను గ్రామా బహిష్కరణ చేస్తూ డప్పు చాటింపు వేయటం అమానుషమని  రాష్ట్ర రజక సంఘం అధ్యక్షులు కడ్తల మల్లయ్య అన్నారు. త ద్వారా  ఈ రెండు కులాల వారి మనోభావాలను దెబ్బతీశారని ఆరోపిస్తూ రెబ్బెన మండలం లోని రజకులు, విశ్వ బ్రాహ్మణులూ గురువారం  రెబ్బెన మండల తహసీల్దార్ కార్యాలయం లో జూనియర్ అసిస్టెంట్ కు వినతి పత్రం సమర్పించారు.   అనంతరం మాట్లాడుతూ మనోభావాలను దెబ్బతీసేలా డప్పు చాటింపు చేసినవారిపై చాట్ట్టరిత్యా  కఠిన చర్యలు తినుకోవాలని అన్నారు. శుక్రవారం మండలంలోని రజక సంఘం షాపులు, నాయి బ్రాహ్మణా షాపులు ఒక రోజు  బంద్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో  మండల రజక సంఘం అధ్యక్షులు రామడుగు శంకర్, నాయి బ్రాహ్మణా సంఘ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె  ఇస్తారి , జిల్లా ఉపాధ్యక్షులు వి కిష్టయ్య, మండల అధ్యక్షులు కళ్యాణం శ్రీనివాస్, మల్లేష్, భీమయ్య, పోశం, లండయ్యా, వెంకటి, శారద, భాగ్య, నందొక్క తదితరులు ఉన్నారు. 

No comments:

Post a Comment