కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన జులై 16 ; తెలంగాణ ప్రభుత్వం పదహారు వేల తొమ్మిదొందల పోలీస్ ఉద్యోగలకొరకు నోటిఫికేషన్ విడుదల చేసిన సందర్భంగా పోలీసు ఉద్యోగాల కొరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న బెల్లంపల్లి ఏరియా అభ్యర్థులకు సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో ఈ నెల23 నుండి సుశిక్షితులైన సీఐఎ్సఎఫ్ జవాన్లచే శారీరిక మరియు అనుభవజ్ఞులైన అధ్యాపకులచే రాత పరీక్ష కొరకు కోచింగ్ క్యాంప్ నిర్వహిస్తున్నామని ఏరియా డీసీఎం పర్సనల్ శ్రీ కె కిరణ్ తెలిపారు. కావున పోలీసు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ పేర్లను 27 వ తేదీ లోపు జీఎం ఆఫీసులోని పర్సనల్ డిపార్ట్మెంట్ లో పేరు నమోదు చేసుకోగలరని, గోలేటి భీమన్న స్టేడియం గ్రౌండ్ నందు కోచింగ్ క్యాంప్ ప్రారంభం కానున్నదని తెలిపారు.
No comments:
Post a Comment